ఎన్నికలకు వెళ్దాం.. సీఎం జగన్కు చంద్రబాబు సవాల్
ABN, First Publish Date - 2020-08-03T22:54:40+05:30
మళ్లీ ఎన్నికలకు వెళ్దామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో..
అమరావతి: మళ్లీ ఎన్నికలకు వెళ్దామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారని ఆయన గుర్తుచేశారు. మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానులను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదన్నారు. ఏపీ రాజధాని ఐదు కోట్ల ప్రజల సమస్య అని చెప్పారు. కులాలు, మతాల సమస్య కాదని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఈ సవాల్పై వైసీపీకి 48 గంటలు సమయం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తామందరం రాజీనామా చేస్తామని చెప్పారు.. వైసీపీ కూడా రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Updated Date - 2020-08-03T22:54:40+05:30 IST