3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: చంద్రబాబు
ABN, First Publish Date - 2020-03-26T20:08:56+05:30
3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు హితవుపలికారు. కరోనా బెడద తీవ్రంగా ఉన్నా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు
అమరావతి: 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు హితవుపలికారు. కరోనా బెడద తీవ్రంగా ఉన్నా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు, మహిళలు దీక్షలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఉద్యమం వెనుక చిత్తశుద్ధిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్థం అయ్యాయని, లక్షలాది కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయాయని విమర్శించారు. అనేక కంపెనీలు ఏపీకి రావాలంటే వెనుకంజ వేస్తున్నాయని, యువత ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-03-26T20:08:56+05:30 IST