భూకబ్జాల కోసమే విశాఖలో రాజధాని ప్రకటన: బండారు
ABN, First Publish Date - 2020-07-04T23:55:22+05:30
భూకబ్జాల కోసమే విశాఖలో రాజధాని ప్రకటన: బండారు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి విమర్శలు గుప్పించారు. ఆర్థిక రాజధాని ముద్దు.. రాజకీయ రాజధాని విశాఖవాసులు వద్దంటున్నారని బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి భూముల విలువ పెంచుకోవడం కోసమే రాజధాని పేరుతో విశాఖపై వాలుతున్నారని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. విజయసాయిరెడ్డి విశాఖలో తిష్టవేశాక వేల ఎకరాలు కబ్జా అయ్యాయని బండారు ఆరోపించారు. ఆరోగ్య సేతు యాప్ రూపొందించిన శైలేజ్ స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బండారు ఆరోపించారు. ఉత్తరాంధ్రపై ప్రేమ కాదని.. భూకబ్జాల కోసమే విశాఖలో రాజధాని ప్రకటన చేశారని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు.
Updated Date - 2020-07-04T23:55:22+05:30 IST