గుండెపోటుతో రాజధాని రైతు మృతి
ABN, First Publish Date - 2020-08-02T23:16:04+05:30
గుండెపోటుతో రాజధాని రైతు మృతి
అమరావతి: గుండెపోటుతో రాజధాని రైతు మృతి చెందారు. నీరుకొండ గ్రామంలో రాజధాని రైతు నన్నపనేని వెంకటేశ్వరరావు గుండె పోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్ బిల్లులపై ఆమోదం తెలిపాక కూడా ఉద్యమంలో రైతు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తీవ్ర ఆవేదనతో రాజధాని రైతు గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజధాని రైతు మృతి చెందడంతో అటు రైతులతోపాటు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Updated Date - 2020-08-02T23:16:04+05:30 IST