రాజధానిగా అమరావతే ఉంటుంది: గొల్లపల్లి
ABN, First Publish Date - 2020-08-05T01:53:27+05:30
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుపై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు స్పందించారు. ఇవాళ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన..
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుపై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు స్పందించారు. ఇవాళ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రాజధాని రైతుల మొదటి విజయం ఇది అని పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం తయారు చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి లేదా కేంద్ర హోంశాఖకు పంపి ఉంటే పర్యావసనాలు వేరేగా ఉండేవని పేర్కొన్నారు. అడుగడుగునా ప్రభుత్వం న్యాయ స్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తోన్న తీరును ప్రజలు గమనిస్తున్నారని సూర్యారావు అన్నారు.
Updated Date - 2020-08-05T01:53:27+05:30 IST