ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం డైరెక్షన్‌లో స్కీముల మాటున స్కాములు చేస్తున్నారు: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2020-05-30T20:01:27+05:30

అమరావతి: పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీలో పాలన సాగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీలో పాలన సాగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. వైసీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారని.. ముఖ్యమంత్రి డైరెక్షన్‌లో స్కీమ్‌ల మాటున స్కామ్ లు చేస్తున్నారని విమర్శించారు. జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ధరల పెంపుతో ప్రజలపై రూ. 50 వేల కోట్ల భారం వేశారని బుద్దా వెంకన్న విమర్శించారు. ఏడాది వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు.


ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ఇసుక మాఫియాను నడుపుతున్నారన్నారు. 90 శాతం హామీలు అమలు చేశామంటున్న ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలన్నారు. రూ.3000 పెన్షన్ ఇస్తామని మాట తప్పారన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో మడమ తిప్పారని బుద్దా వెంకన్న విమర్శించారు. కరోనా విపత్తులోనూ కాంట్రాక్టర్లకు కోట్లు దోచిపెట్టారన్నారు. పాలనపై ప్రశ్నిస్తారనే భయంతో మీడియాకు జగన్ మొహం చాటేస్తున్నారన్నారు. పాలనాదక్షునికి ఉండాల్సిన లక్షణాలు జగన్‌కు లేవని బుద్దా వెంకన్న విమర్శించారు.

Updated Date - 2020-05-30T20:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising