జగన్, విజయసాయిని ప్రశ్నించిన బుద్దా వెంకన్న
ABN, First Publish Date - 2020-09-30T00:17:43+05:30
జగన్, విజయసాయిని ప్రశ్నించిన బుద్దా వెంకన్న
అమరావతి: బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు. 850 ముఖ్యమైన పదవులు మీ జాతి వారికి ఇచ్చుకున్నప్పుడు బీసీలు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. సజ్జలరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డికి పదవులు పంచినప్పుడు బీసీలపై ప్రేమ ఎక్కడికి పోయిందని నిలదీశారు. బీసీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం మీ జాతి నాయకులు సమావేశం పెట్టుకున్నప్పుడు బీసీలపై మమకారం ఎక్కడికి పోయింది? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
Updated Date - 2020-09-30T00:17:43+05:30 IST