సజ్జల స్థాయికి మించి మాట్లాడ్తున్నారు: బుద్దా
ABN, First Publish Date - 2020-02-20T00:31:32+05:30
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయికి మించి మాట్లాడ్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడంలో జగన్
విజయవాడ: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయికి మించి మాట్లాడ్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులను వైసీపీ నేతలు చెప్పు చేతలో పెట్టుకున్నారన్నారు. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపదను సృష్టించడం చేతగాక చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Updated Date - 2020-02-20T00:31:32+05:30 IST