అమరావతిపై పవన్ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలి: బీటెక్ రవి
ABN, First Publish Date - 2020-08-03T19:07:56+05:30
సీఆర్డియే బిల్లు రద్దు, పాలనా వికేంద్రీకరణ గెజిట్లు రాజ్యాంగ విరుద్ధమంటూ..
అమరావతి: సీఆర్డియే బిల్లు రద్దు, పాలనా వికేంద్రీకరణ గెజిట్లు రాజ్యాంగ విరుద్ధమంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల అధికారం ప్రభుత్వానికి లేదంటూ పిటిషన్ వేసింది. కార్యాలయాన్ని అమరావతికి తరలించకుండా చూడాలని కోరింది. మరోవైపు అమరావతి రైతులకు సంఘీభావంగా బీటెక్ రవి నిరసన శిబిరానికి వచ్చారు. ఇప్పటికే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా.. చైర్మన్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అలాగే ఈ ప్రాంత వైసీపీ ప్రజాప్రతినిధులూ కూడా రాజీనామా చేయాలని పిలుపు ఇచ్చారు. రాజధాని ప్రాంత ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలంటున్న.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు జనసేన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని, అమరావతి విషయంలో పవన్ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు.
Updated Date - 2020-08-03T19:07:56+05:30 IST