అసమర్థ పాలనకు ప్రజలెందుకు బలి కావాలి?: బోండా ఉమా
ABN, First Publish Date - 2020-11-25T16:41:15+05:30
అసమర్థ పాలనకు ప్రజలెందుకు బలి కావాలి?: బోండా ఉమా
విజయవాడ: జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నులు పెంచారని పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మండిపడ్డారు. ఇప్పటికే వైసీపీ పెంచిన 50 రకాల ట్యాక్స్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అసమర్థ పాలనకు ప్రజలెందుకు బలి కావాలి? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు పెంచిన ఇంటి పన్ను కట్టాలంటే ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్నారు. ఆస్తి, నీటి పన్ను పెంచే ఆలోచన వైసీపీ విరమించుకోవాలని సూచించారు.
Updated Date - 2020-11-25T16:41:15+05:30 IST