ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు: బోండా ఉమ
ABN, First Publish Date - 2020-05-30T23:34:19+05:30
ఏడాది పాలనలో జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు.
అమరావతి: ఏడాది పాలనలో జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏడాది పాలనంతా అబద్ధాలతోనే కొనసాగిందన్నారు. లాక్డౌన్ సమయంలో కూడా ప్రకటనల కోసం..వందల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు..ఏడాది అంతా దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందన్నారు. ఏడాది పాలనలో వైసీపీ మేనిఫెస్టో అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
Updated Date - 2020-05-30T23:34:19+05:30 IST