ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలను మభ్యపెట్టిన జగన్‌: బొండా ఉమ

ABN, First Publish Date - 2020-03-24T09:25:44+05:30

‘కోర్టు పరిధిలోని అమరావతి భూములను లక్ష మంది పేదలకు పంచుతామని ప్రభుత్వం మభ్యపెట్టింది. జీవో నంబరు 107 ద్వారా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘‘కోర్టు పరిధిలోని అమరావతి భూములను లక్ష మంది పేదలకు పంచుతామని ప్రభుత్వం మభ్యపెట్టింది. జీవో నంబరు 107 ద్వారా కుట్రకు తెరదీసింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది’’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతి భూములను సీఆర్‌డీఏ ఒప్పందం ప్రకారమే చేయాలని, అమరావతి ప్రాంతంలోని పేదవాళ్లకు మాత్రమే ఇవ్వాలని హైకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. టీడీపీ హయాంలో లక్షమంది పేదవాళ్లకు పక్కాఇళ్లు కట్టించాలని జక్కంపూడిలో భూమి కొనటానికి కేటాయించిన రూ.100 కోట్లను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఉమ విమర్శించారు. పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.

Updated Date - 2020-03-24T09:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising