నానిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు?: బోండా ఉమ
ABN, First Publish Date - 2020-09-30T18:15:06+05:30
నానిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు?: బోండా ఉమ
విజయవాడ: రాష్ట్రంలో వైసీపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. అన్ని మతాలను గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. మంత్రి కొడాలి నాని హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్యానించారు. జగన్ స్పందించి నానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-09-30T18:15:06+05:30 IST