నేటి సాయంత్రం బీజేపీ రాయలసీమ వర్చ్యువల్ ర్యాలీ
ABN, First Publish Date - 2020-06-22T19:32:59+05:30
అమరావతి: బీజేపీ రాయలసీమ జోన్ జన సంవేద్ వర్చ్యువల్ ర్యాలీ నేటి సాయంత్రం జరగనుంది.
అమరావతి: బీజేపీ రాయలసీమ జోన్ జన సంవేద్ వర్చ్యువల్ ర్యాలీ నేటి సాయంత్రం జరగనుంది. 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వర్చువల్ ర్యాలీ జరగనుంది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడంతో పాటు ఏపీకి ఏం చేశామో వివరించనున్నారు. హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, పురందేశ్వరి, ఢిల్లీ నుంచి జీవీఎల్, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి సునిల్ దియోదర్ తదితరులు ర్యాలీలో పాల్గొననున్నారు.
Updated Date - 2020-06-22T19:32:59+05:30 IST