గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన
ABN, First Publish Date - 2020-06-16T17:41:01+05:30
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగం
విజయవాడ: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా 3 రాజధానుల అంశం గురించి మాట్లాడారు. ‘‘మా పాలనలో పరిపాలన వికేంద్రికరణ కీలక అంశం. మూడు రాజధానులు కలిగి ఉండే అవకాశం. శాసనం ప్రక్రియలో ఉంది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా’’ ఉంటుందని గవర్నర్ ప్రసంగించారు.
Updated Date - 2020-06-16T17:41:01+05:30 IST