నష్టపోయిన రైతులను పట్టించుకోకపోవడం దారుణం: అయ్యన్న
ABN, First Publish Date - 2020-11-29T19:56:48+05:30
నష్టపోయిన రైతులను పట్టించుకోకపోవడం దారుణం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు
విశాఖ: నష్టపోయిన రైతులను పట్టించుకోకపోవడం దారుణం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేలాది రైతు కుటుంబాలు కష్టాల్లో ఉంటే కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించలేదని విమర్శించారు. ఎకరాకు నష్టపరిహారం రూ.6,500 ఇస్తామనడం వ్యవసాయ రంగంపై సీఎం జగన్ అవగాహన లేమికి నిదర్శనం అని చెప్పారు. పంట బీమా, ప్రీమియంపై ప్రభుత్వం రైతులకు వివరణ ఇవ్వాలని అయ్యన్న కోరారు.
Updated Date - 2020-11-29T19:56:48+05:30 IST