ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైల్‌ భరో పిలుపుతో ప్రభుత్వ పునాదులు కదిలాయి: అచ్చెన్న

ABN, First Publish Date - 2020-10-31T17:32:07+05:30

అమరావతి: కాడి పట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసి.. రైతు ద్రోహిగా ఏపీ సీఎం జగన్‌రెడ్డి మిగిలిపోయారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కాడి పట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసి.. రైతు ద్రోహిగా ఏపీ సీఎం జగన్‌రెడ్డి మిగిలిపోయారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. గుంటూరు జైల్‌ భరో పిలుపుతో ప్రభుత్వ పునాదులు కదిలాయని అచ్చెన్న తెలిపారు. జైల్‌ భరోకు వెళ్తున్న వారిని హౌస్‌ అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు కాదు, వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయన్నారు. రాజధానికి వ్యతిరేకంగా పెయిడ్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టి.. వైసీపీ నేతలు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని అచ్చెన్నాయుడు సూచించారు. రైతు రాజ్యం అంటే ప్రశ్నించిన రైతులకు బేడీలు వేయడమా? అని ప్రశ్నించారు. తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చుని ఏం చేయాలో అర్థంకాక.. రైతులపై పగ, ప్రతీకారాలకు జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 

Updated Date - 2020-10-31T17:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising