ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చారిత్రక కట్టడాల కూల్చివేత బాధాకరం: అశోక్ గజపతి రాజు

ABN, First Publish Date - 2020-05-23T17:12:55+05:30

విజయనగరం: చారిత్రక కట్టడాలు కూల్చివేత బాధాకరమని మాజీ కేంద్రమంత్రి, విజయనగర రాజవంశీయులు పూసపాటి అశోకగజపతి రాజు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: చారిత్రక కట్టడాలు కూల్చివేత బాధాకరమని మాజీ కేంద్రమంత్రి, విజయనగర రాజవంశీయులు పూసపాటి అశోకగజపతి రాజు పేర్కొన్నారు. వందల ఏళ్ల క్రితం విజయనగరంలో నిర్మించిన మూడు లాంతర్లు కట్టడం విజయనగరానికి చారిత్రక చిహ్నంగా ఉందన్నారు. ఆనాటి విజయనగర వైభవానికి కొన్ని ఆనవాళ్లున్నాయన్నారు. అందులో గంటస్తంభం, ముడులాంతర్లు, మ్యూజిక్ కళాశాల వంటివి కొన్ని మచ్చు తునకలని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. ముడులాంతర్ల వద్ద స్వతంత్ర సమరయోధులు నిర్మించిన మూడు సింహాలు చిహ్నం కి కూడా ఇప్పటి ప్రభుత్వాలు, అధికారులు గౌరవం ఇవ్వడం లేదు.


ఈనాడు రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్న  నాయకులే చారిత్రక చిహ్నాలు ధ్వంసానికి పాల్పడటం దారుణమన్నారు. ముడు లాంతర్ల జంక్షన్ వద్ద హరికథా పితామహుడు అదిభట్ల నారాయణ దాసు హరికథలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.  ప్రజలు స్పందించాలి చరిత్రకు, చరిత్ర అనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలన్నారు. తాము ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతామన్నారు. ఇది మనందరి భవిష్యత్తు అని.. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియచేయాలని అశోక్ గజపతి రాజు కోరారు.


Updated Date - 2020-05-23T17:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising