‘మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం దారుణం’
ABN, First Publish Date - 2020-11-29T17:56:35+05:30
‘మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం దారుణం’
విజయనగరం: సింహాచల దేవస్థాన స్థిర, చరాస్థుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. పారదర్శకత లోపిస్తే అమూల్యమైన విలువలు పక్కదారి పడతాయని సూచించారు. ‘‘అప్పన్న సేవకుల ఆకలి కేకలు, ఏడు మాసాలుగా..మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం దారుణం’’ అన్నారు. మాన్సాస్లో రూ.125 కోట్ల డిపాజిట్లుండగా సిబ్బందిని ఇబ్బందులకెందుకు గురిచేస్తున్నారు? అని ప్రశ్నించారు.
Updated Date - 2020-11-29T17:56:35+05:30 IST