పీజీలో ప్రవేశానికి నేటి నుంచి దరఖాస్తులు
ABN, First Publish Date - 2020-05-28T13:02:50+05:30
పీజీలో ప్రవేశానికి నేటి నుంచి దరఖాస్తులు
నెల్లూరు/వెంకటాచలం : విక్రయ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్యూ) పరిఽధిలోని అనుబంధ కళాశాలల్లో గురువారం నుంచి ఉన్నత విద్య (పీజీ) ప్రవేశాలు ప్రారంభం అవుతాయని వీఎస్యూ పీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ టీ వీరారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సౌకర్యార్థం ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఓపన్ అయిందన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30వ తేదీ కాగా, ఆలస్య రుసుముతో జులై 3వ తేదీ వరకు, తత్కాల్ రుసుముతో జులై 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం వీఎస్యూ వెబ్సైట్ను సంప్రదించవచ్చన్నారు.
Updated Date - 2020-05-28T13:02:50+05:30 IST