ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు.. అయితే గుడ్‌న్యూస్ ఏంటంటే..

ABN, First Publish Date - 2020-08-13T22:28:02+05:30

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు, 82 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 963 కరోనా పాజిటివ్ కేసులు, విశాఖపట్నం జిల్లాలో 931, అనంతపురం 856, పశ్చిమ గోదావరి 853, కర్నూలు 823, కడప 784, నెల్లూరు 682, ప్రకాశం 681, గుంటూరు 595, విజయనగరం 569, శ్రీకాకులం 425, కృష్ణా జిల్లాలో 330 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


ఏపీలో కొత్తగా నమోదైన కరోనా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,142కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 90,840. ఏపీలో గడచిన 24 గంటల్లో 82 మంది కరోనా వల్ల మరణించారు. తూర్పుగోదావరిలో 10 మంది, గుంటూరులో 10, అనంతపురంలో 8 మంది, కడపలో 7, చిత్తూరులో 6, కర్నూలులో 6, నెల్లూరులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 6, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 5, కృష్ణ జిల్లాలో ఒకరు కరోనా వల్ల మరణించారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2378కి చేరింది.


అయితే.. ఏపీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరగడం కొంత ఊరట కలిగించే విషయం. గడచిన 24 గంటల్లో 9,499 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ఇప్పటివరకూ 1,70,924 మంది కరోనా నుంచి కోలుకున్నారు.



Updated Date - 2020-08-13T22:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising