ఏపీ ప్రజల ప్రాణాలతో జగన్ ఆడుకుంటున్నారు: వినోద్రెడ్డి
ABN, First Publish Date - 2020-06-07T01:46:54+05:30
ఏపీ ప్రజల ప్రాణాలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారని జనసేన నేత వినోద్రెడ్డి మండిపడ్డారు. నవరత్నాల రూపంలో ఇస్తూ కరెంట్ బిల్లుల రూపంలో.. ఆ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు.
హైదరాబాద్: ఏపీ ప్రజల ప్రాణాలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారని జనసేన నేత వినోద్రెడ్డి మండిపడ్డారు. నవరత్నాల రూపంలో ఇస్తూ కరెంట్ బిల్లుల రూపంలో.. ఆ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. సరైన మద్యం దొరక్క ప్రజలు శానిటైజర్లు తాగుతున్నారని, వైసీపీ ప్రభుత్వం పేదల రక్తాన్ని పిండుతోందని ధ్వజమెత్తారు. సామాన్యులు, బిల్డర్లకు ఇసుక అందే పరిస్థితి లేదన్నారు. నెల్లూరు జిల్లా నుంచి రాయలసీమకు ఇసుక తరలిపోతోందని, ఎమ్మెల్యే బంధువుకి నామినేటెడ్ పద్ధతిలో ఇసుక రీచ్ ఇచ్చారని ఆరోపించారు. తమ నియోజకవర్గాలకు ఇసుక అందడం లేదని.. వైసీపీ ఎమ్మెల్యేలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీసీల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని వినోద్రెడ్డి ఆరోపించారు.
Updated Date - 2020-06-07T01:46:54+05:30 IST