మోదీకి బానిసగా మారిన జగన్:శైలజానాథ్
ABN, First Publish Date - 2020-12-03T09:00:05+05:30
మోదీకి బానిసగా మారిన జగన్:శైలజానాథ్
గుజరాతీపేట(శ్రీకాకుళం), డిసెంబరు 2: ‘‘సీఎం జగన్మోహన్రెడ్డికి దమ్ముంటే.. ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర సీఎం జగన్ బానిసగా మారారు’’ అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాఽథ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు, పంపుసెట్లకు మీటర్లు బిగించే విషయమై ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో బుధవారం చేపట్టిన నిరసనలో మాట్లాడారు.
Updated Date - 2020-12-03T09:00:05+05:30 IST