ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా
ABN, First Publish Date - 2020-12-01T23:59:59+05:30
ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా
అమరావతి: ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. పంచాయతీరాజ్ బిల్లుపై మండలిలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్పై వ్యక్తిగత దూషణకు మంత్రి వెల్లంపల్లి దిగారు. మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలంటూ పోడియం వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. సభ ఆర్డర్లో లేకపోవడంతో చైర్మన్ వాయిదా వేశారు.
Updated Date - 2020-12-01T23:59:59+05:30 IST