అచ్చెన్న బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
ABN, First Publish Date - 2020-07-16T23:30:37+05:30
ఈఎస్ఐ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే..
అమారావతి : ఈఎస్ఐ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ స్కామ్లో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై నేడు రాష్ట్ర హైకోర్టు విచారించింది. సుధీర్ఘ విచారణ అనంతరం విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు అచ్చెన్న తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా సోమవారం నాడు ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగనున్నాయి. వివిధ పత్రాలను పరిశీలించాల్సి ఉండటంతో విచారణను హైకోర్టు సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు ఎలా ఇవ్వబోతోంది..? బెయిల్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Updated Date - 2020-07-16T23:30:37+05:30 IST