ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు కృష్ణంరాజు
ABN, First Publish Date - 2020-09-29T11:50:15+05:30
తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణలో తమ
అమరావతి: తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Updated Date - 2020-09-29T11:50:15+05:30 IST