కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలం: జయదేవ్
ABN, First Publish Date - 2020-09-21T01:40:10+05:30
కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలమయిందని ఎంపీ జయదేవ్ తప్పుబట్టారు. ఏపీలోని కరోనా పరిస్థితిని లోక్సభలో జయదేవ్ ప్రస్తావించారు. మాస్క్లు అడిగిన డాక్టర్పై పిచ్చోడిగా
ఢిల్లీ: కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలమయిందని ఎంపీ జయదేవ్ తప్పుబట్టారు. ఏపీలోని కరోనా పరిస్థితిని లోక్సభలో జయదేవ్ ప్రస్తావించారు. మాస్క్లు అడిగిన డాక్టర్పై పిచ్చోడిగా ముద్రవేశారని, వైద్యసదుపాయాలు బాగాలేవన్న డాక్టర్ను అరెస్టు చేయాలని ఆదేశించారని తెలిపారు. కరోనా కేసుల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానానికి ఎగబాకడం.. ప్రభుత్వ చేతగానితనమేనని విమర్శించారు. కేంద్రం నిధులను కూడా సరిగా ఖర్చు చేయడం లేదని గల్లా జయదేవ్ ఆరోపించారు.
Updated Date - 2020-09-21T01:40:10+05:30 IST