ఛీటర్గా మిగిలిపోవద్దు.. జగన్కు రామకృష్ణ సూచన
ABN, First Publish Date - 2020-08-04T00:56:20+05:30
ప్రజల్లో ఛీటర్గా మిగిలిపోవద్దని ఏపీ సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన..
హైదరాబాద్: ప్రజల్లో ఛీటర్గా మిగిలిపోవద్దని ఏపీ సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన డిబేట్లో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానికి మద్దతిచ్చి.. మాట తప్పొద్దని రామకృష్ణ తెలిపారు. రాజీనామాల సవాళ్లు సర్వసాధారణమేనన్నారు. ఎవరు కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లరని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని పునరాలోచించాలని రామకృష్ణ సూచించారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2020-08-04T00:56:20+05:30 IST