ఏపీకి కరోనా వైద్య సామగ్రి దిగుమతి
ABN, First Publish Date - 2020-04-05T08:41:01+05:30
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో, కొద్ది రోజులు గా వెలవెలబోయిన విజయవాడ విమానాశ్రయం ప్రస్తుతం కా ర్గో విమానాలతో కొం త సందడిని సంతరించుకుంది. శనివారం ఎయిర్ ఇండియా తన కార్గో సేవలను
విజయవాడ, ఏప్రి ల్ 4(ఆంధ్రజ్యోతి): కరోనా లాక్డౌన్ నేపథ్యంలో, కొద్ది రోజులు గా వెలవెలబోయిన విజయవాడ విమానాశ్రయం ప్రస్తుతం కా ర్గో విమానాలతో కొం త సందడిని సంతరించుకుంది. శనివారం ఎయిర్ ఇండియా తన కార్గో సేవలను ప్రారంభించింది. కరోనా నివారణకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కో సం ముంబై నుంచి ఎయిర్ ఇండియా 68 కార్టన్ల వైద్య ఎక్వి్పమెంట్ను తీసుకువచ్చింది. రాష్ట్రంలోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందించే వైద్య సిబ్బందికి అందించే అత్యున్నతమైన ఎన్ 95 మాస్కులు, స్టేషనరీ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2020-04-05T08:41:01+05:30 IST