ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా 21న ఏవోబీ బంద్‌

ABN, First Publish Date - 2020-12-21T01:36:09+05:30

బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 21 ఏవోబీ బంద్‌కు మావోయిస్టు నేత కైలాసం పిలుపునిచ్చారు. నిద్రిస్తున్న తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు పట్టుకుని కాల్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 21 ఏవోబీ బంద్‌కు మావోయిస్టు నేత కైలాసం పిలుపునిచ్చారు. నిద్రిస్తున్న తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని తెలిపారు. పార్టీ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన చిన్న పసిపాపను కూడా చంపారని దుయ్యబట్టారు. పోలీసులు చేస్తున్న హత్యలను నిరసిస్తూ 21న ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని కైలాసం విజ్ఞప్తి చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, బూటకపు ఎన్‌కౌంటర్లతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఎన్‌కౌంటర్ల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కైలాసం ధ్వజమెత్తారు.  ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలో సింగవరం గ్రామంలో ఈ నెల 12వ తేదీన ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

Updated Date - 2020-12-21T01:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising