ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజాకు ఘాటుగా కౌంటరిచ్చిన అనిత

ABN, First Publish Date - 2020-04-09T21:45:34+05:30

వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఘాటుగా కౌంటరిచ్చారు. చంద్రబాబును విమర్శించేముందు వైసీపీ నేతలు పదిసార్లు ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.


రోజా: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాష్ట్రంలో ఉండకుండా, కనీసం కుప్పంలో కూడా ఉండకుండా హైదరాబాద్‌లో కూర్చోని  ఏపీ నుంచి అమెరికా వరకు సలహాలు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. ఆయన సలహాలు ట్రంప్‌కు అవసరమేమోగానీ, జగన్‌కు అవసరం లేదన్నారు.


అనిత: చంద్రబాబు ఎక్కడున్నారన్నది ముఖ్యం కాదని అన్నారు. ప్రజలకోసం పనిచేస్తున్నామా.. లేదా అన్నది ముఖ్యమని అన్నారు. సీఎం జగన్ తాడేపల్లిలో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదని విమర్శించారు. 150 మంద ఎమ్మెల్యేల భజన చూస్తుంటే... ఏ భజన వాళ్లముందు పనికిరాదని ఎద్దేవా చేశారు. కొంతమంది వైసీపీ నాయకులు చంద్రబాబు వల్ల ఉపయోగం లేదని మాట్లాడుతున్నారని.. విశాఖలో మెడ్ టెక్ జోన్‌ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి అర్థం చేసుకోవాలన్నారు. లాక్ డౌన్‌కు గౌరవించి చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ప్రజలకోసం పనిచేస్తున్నారని అనిత స్పష్టం చేశారు.

Updated Date - 2020-04-09T21:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising