ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌనదీక్షలో మాజీ మంత్రి రఘువీరా

ABN, First Publish Date - 2020-03-25T21:05:29+05:30

జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠపురంలో మాజీ మంత్రి రఘువీరా మౌన దీక్ష చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠపురంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డి మౌన దీక్ష చేపట్టారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. శార్వరీ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత 25ఏళ్లుగా రఘువీరా ఉగాది రోజున మౌన దీక్ష చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కరోనా బారి నుంచి కాపాడాలని,  ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరువు, కాటకాల నుంచి ప్రజలను రక్షించాలన్నదే ఇవాళ్టి తన దీక్ష ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.


గతంలో మడకశిర మండల పరిషత్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం ముందు రఘువీరా మౌనదీక్ష చేపట్టేవారు. ఈ సంవత్సరం జనతా కర్ఫ్యూ కారణంగా స్వగ్రామం నీలకంఠాపురంలోని తన నివాసంలోని గాంధీ చిత్రపటానికి పూజలు నిర్వహించి  మౌన దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు పరిమిత సంఖ్యలో కుంటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-25T21:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising