ఏపీలో మరిన్ని సడలింపులు
ABN, First Publish Date - 2020-05-26T22:01:20+05:30
ఆంధ్రప్రదేశ్లో మరిన్ని సడలింపులు ఇస్తూ జగన్ సర్కార్ తాజా ఆదేశాలు ఇచ్చింది. నగలు, బట్టలు, చెప్పుల షాపులకు అనుమతులు ఇచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరిన్ని సడలింపులు ఇస్తూ జగన్ సర్కార్ తాజా ఆదేశాలు ఇచ్చింది. నగలు, బట్టలు, చెప్పుల షాపులకు అనుమతులు ఇచ్చింది. స్ట్రీట్ పుడ్స్కి కూడా అనుమతి ఇచ్చింది. అయితే పానీపూరి బండ్లకు, బట్టల షాపుల్లో ట్రయల్ రూమ్లకు అనుమతి నిరాకరించింది. పెద్ద షోరూంలకు వెళ్లాలంటే ఆన్లైన్లో అనుమతులు తప్పనిసరని తెలిపింది. నగల దుకాణాల్లో డిస్పోజబుల్ చేతి తోడుగులు ఉండాలని పేర్కొంది. వీటికి సంబంధించిన ఆదేశాలను పురపాలక శాఖ విడుదల విడుదల చేసింది.
Updated Date - 2020-05-26T22:01:20+05:30 IST