ఏపీలో కొత్తగా 3,892 కరోనా కేసులు.. 28 మరణాలు
ABN, First Publish Date - 2020-10-15T01:49:36+05:30
ఏపీలో కొత్తగా 3,892 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో...
అమరావతి: ఏపీలో కొత్తగా 3,892 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 28 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7 లక్షల 67 వేల 465కి కరోనా సోకింది. మొత్తం 6,319 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 41 వేల 669 యాక్టివ్ కేసులు ఉండగా 7 లక్షల 19 వేల 477 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు 67 లక్షల 72 మందికి కరోనా టెస్టు చేశారు. తాజాగా చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో నలుగురు, తూ.గో., గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఇద్దరు, కర్నూలు, విజయనగరం, ప.గో. జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
Updated Date - 2020-10-15T01:49:36+05:30 IST