వలస కార్మికుల వసతికి 294 కేంద్రాలు
ABN, First Publish Date - 2020-04-05T14:36:03+05:30
వలస కార్మికుల వసతికి 294 కేంద్రాలు
అమరావతి, (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 294 వసతి కేంద్రాలను నెలకొల్పినట్లు రాష్ట్ర సమన్వయకర్త, ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శనివారం తెలిపారు. ఈ కేంద్రాల్లో 17,475 మంది నిరాశ్రయులు, వలసకార్మికులకు వసతితోపాటు ఆహారం, వైద్యసదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్జీఓలు మరో 36 కేంద్రాలు ఏర్పాటుచేసి 4,142 మందికి వసతి కల్పిస్తున్నాయని వివరించారు. కంపెనీలు 19,207 మందికి తక్షణ వసతి కల్పించి ఆహారం అందిస్తున్నాయని చెప్పారు.
Updated Date - 2020-04-05T14:36:03+05:30 IST