ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ప్రాంతాలకూ వైరస్‌

ABN, First Publish Date - 2020-05-27T09:55:57+05:30

పురంలోని కొత్త ప్రాంతాలకూ కరోనా వైరస్‌ వ్యాపిస్తోంది. కాంటాక్ట్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురంలో తగ్గని ఉధృతి..

తాజాగా భార్యాభర్తలకు పాజిటివ్‌..

166కి చేరిన బాధితుల సంఖ్య..


హిందూపురం టౌన్‌, మే 26: పురంలోని కొత్త ప్రాంతాలకూ కరోనా వైరస్‌ వ్యాపిస్తోంది. కాంటాక్ట్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం మెయిన్‌ బజార్‌లోని భార్యాభర్తలకు వైరస్‌ సోకింది. కరోనా బారిన పడిన వారిలో ఒకరు అధికార పార్టీ ఆధ్యర్యంలో పట్టణంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీలో పాల్గొన్నారు. దీంతో అధికార పార్టీ నాయకులకు కాంటాక్ట్‌ టెన్షన్‌ పట్టుకుంది.


వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ రోజు ఎన్ని నమోదవుతాయోనన్న భయం పట్టణ ప్రజలను వెంటాడుతోంది. కొన్ని కేసుల్లో లింకులు కూడా సరిగా దొరకట్లేదని అధికారులు తలలు బాదుకుంటున్నారు. హిందూపురంలో మొదటి పాజిటివ్‌ కేసు మార్చి 29న బయటపడింది. మంగళవారం నాటికి పట్టణ వాసులు 139 మంది, గుజరాత్‌, ఢిల్లీ, కర్ణాటకకు చెందిన 27 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 166కి చేరింది. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చి రెండు నెలలు దాటినా కేసులు మాత్రం తగ్గట్లేదు.

Updated Date - 2020-05-27T09:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising