ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-07-12T10:14:20+05:30

చేపల వేటకు వచ్చిన ఓ యువకుడు కోనాపురం టన్నల్‌ వద్ద శనివారం శవమై తేలాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనగానపల్లి, జూలై 11: చేపల వేటకు వచ్చిన ఓ యువకుడు కోనాపురం టన్నల్‌ వద్ద శనివారం శవమై తేలాడు. కనగానపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం రాయల్‌ నగర్‌కు చెందిన టీచర్‌ రామాంజినేయలు కుమారుడు శశాంక్‌(24) తన స్నేహితులతో కలసి చేపల కోసం శుక్రవారం కోనాపురం టన్నల్‌ వద్దకు వచ్చాడు. చేపలు పట్టేందుకు ట్యూబ్‌ మీద టన్నల్‌ లోపలికి శశాంక్‌ ఒక్కడే వెళ్ళాడు.


ఎంతసేపయినా శశాంక్‌ బయటికి రాకపోవడంతో బంధువులకు సమాచారం అందించారు. బంధువులు అక్కడికి వచ్చి వెతికినా శశాంక్‌ ఆచూకీ దొరక లేదు. శనివారం శశాంక్‌ శవమై తేలాడు. కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. టన్నల్‌లో ఊపిరాడక శశాంక్‌ మృతి చెందాడా లేక మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-12T10:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising