ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిస్మ్‌సకు గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2020-12-21T05:11:00+05:30

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా పలు నగరాలకు ప్రత్యేక రైళ్లను వేసినట్లు ఆదివారం రైల్వే అధికారులు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు, డిసెంబరు20: క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా పలు నగరాలకు ప్రత్యేక రైళ్లను వేసినట్లు ఆదివారం రైల్వే అధికారులు తెలియజేశారు. యవ్వంతపూర్‌-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.06521) ఈనెల 24వ తేదీన ఉదయం 11-30 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు రాత్రి 8 గంటలకు చేరుకుని, మరుసటిరోజు ఉదయం 5-25 గంటలకు జైపూర్‌ వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం.06522) జైపూర్‌లో 26వ తేదీ రాత్రి 10-30 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు మరుసటిరోజు ఉద యం 8-15 గంటలకు వచ్చి, యశ్వంతపూర్‌కు సాయంత్రం 6-10 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలు అజ్మీర్‌, బిల్వారా, వడోదర, సూరత్‌, పుణె, షోలాపూర్‌, రాయచూరు, గుంతకల్లు, బళ్లారి, చిత్రదుర్గం, అరిసికెర, తుమకూరు మీదుగా గమ్యానికి చేరుతుందన్నారు. య శ్వంతపూర్‌-అహ్మదాబాద్‌ రైలు (నెం.06502) ఈనెల 27న సాయంత్రం 4-45కు బయలుదేరి గుంతకల్లుకు రా త్రి 7-05కు వచ్చి, అహ్మదాబాద్‌ వెళ్తుందన్నారు. తి రుగు ప్రయాణపు రైలు (నెం.06501) అహ్మదాబాద్‌లో 29వ తే దీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు  మరుసటిరోజు రాత్రి 9-40కు వచ్చి, యశ్వంతపూర్‌కు 31వతేదీ ఉదయం 4-45కు చేరుతుందన్నారు. ఈ రైలు హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదో ని, రాయచూరు, వాడి, షోలాపూర్‌, డౌండ్‌, కోపర్‌గావ్‌, మన్మాడ్‌, జల్‌గావ్‌, సూరత్‌, వడోదర, అనంద్‌, తదితర స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు. యశ్వంతపూర్‌-లాతూరు ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెం.06583) 23న సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు అర్ధరాత్రి 12-35 గంటలకు చేరుకుని, లాతూరుకు మధ్యాహ్నం 1-05 గంటలకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం.06584) ఈనెల 24న మధ్యాహ్నం 3-45కు బీదర్‌లో బయలుదేరి గుంతకల్లుకు తెల్లవారుజాము 1-50కు వచ్చి యశ్వంతపూర్‌కు ఉదయం 7-40కు చేరుతుందన్నారు. ఈ రైలు యల్హంక, గౌరీబిదనూరు, హిందూపురం, ధర్మవరం, గుతకల్లు, రాయచూరు, సైదాపూర్‌, యాద్గిర్‌, నా ల్వార్‌, చిట్టాపూర్‌, వికారాబాద్‌, జహిరాబాద్‌, తదితర స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు. హుబ్లీ-మైసూర్‌ (నెం. 06581) 23వ తేదీ సాయంత్రం 6-20 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు రాత్రి 10-30 గంటలకు వచ్చి మైసూరు కు మరుసటిరోజు ఉదయం 9-20కు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం.06582) 23వ తేదీ సా యంత్రం 7 గంటలకు మైసూరులో బయలుదేరి గుంతకల్లుకు మరుసటి రోజు ఉదయం 4-45 గంటలకు వచ్చి, హుబ్లీకి ఉదయం 10-50 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు మాండ్యా, చన్నపట్నం, బెంగళూరు సిటీ, య ల్హంక, దొడ్డబళ్లాపూర్‌, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, బళ్లారి, తోరణగల్లు, హోస్పేట, మునిరాబాద్‌, కొప్పల్‌, గదగ్‌, తదితర స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందన్నారు. యశ్వంతపూర్‌-బీదర్‌ రైలు (నెం.06271) ఈనెల 24న సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గుం తకల్లుకు అర్ధరాత్రి 12-35 గంటలకు వచ్చి, బీదర్‌కు ఉ దయం 9-15గంటలకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 06272) బీదర్‌లో 25వ తేదీ సాయం త్రం 6-15 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు తెల్లవారుజాము 1-50 గంటలకు వచ్చి, యశ్వంతపూర్‌కు ఉద యం 7-40 గంటలకు చేరుకుంటుందన్నారు. ముంబై-చెన్నై (నెం.02163) డెయిలీ ఎక్సప్రెస్‌ రైలు జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు లోకమాన్య తిలక్‌ స్టేషన్‌లో సాయంత్రం 6-45 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8-25 గంటలకు గుంతకల్లుకు, సాయంత్రం 4-20 గంటలకు చెన్నై చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 02164) జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వర కూ రోజూ చెన్నైలో  సాయంత్రం 7-23 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజాము 1-43 గంటలకు గుంతకల్లుకు, సాయంత్రం 3-40 గంటలకు ముంబై చేరుతుందన్నారు. ఈ రైలు థానే, కళ్యాణ్‌, పుణె, షోలాపూర్‌, వాడి, రాయచూరు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తి రుత్తణి, అరక్కోణం మీదుగా వెళ్తుందన్నారు.


Updated Date - 2020-12-21T05:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising