జిల్లాకు చేరిన సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రాలు
ABN, First Publish Date - 2020-09-18T10:59:51+05:30
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రాలు గురువారం జిల్లాకు చేరుకున్నాయి. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. 486
అనంతపురం విద్య, సెప్టెంబరు 17: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రాలు గురువారం జిల్లాకు చేరుకున్నాయి. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. 486 బాక్సుల్లో ప్రత్యేక వాహనంలో ఉదయమే జిల్లా కేంద్రంలోని జడ్పీకి ప్రశ్నపత్రాలు వచ్చాయి. జేసీ సిరి.. పశ్నపత్రాల ప్రత్యేక వాహనాన్ని పరిశీలించారు.
తర్వాత వీడియో చిత్రీకరణ నడుమ ప్రశ్నపత్రాల బాక్సులను కార్మికులు జడ్పీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ఓఎంఆర్షీట్లు, నామినల్ రోల్స్ జిల్లాకు చేరాయి.
Updated Date - 2020-09-18T10:59:51+05:30 IST