జిల్లా ప్రజల అభిమానంతోనే కోలుకున్నా
ABN, First Publish Date - 2020-08-07T10:45:49+05:30
జిల్లా ప్రజల ఆదరాభిమానాలతోనే కరోనా వైరస్ నుంచి కోలుకున్నానని ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నేఫెర్రర్ ..
ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నేఫెర్రర్
అనంతపురం క్లాక్టవర్, ఆగస్టు 6: జిల్లా ప్రజల ఆదరాభిమానాలతోనే కరోనా వైరస్ నుంచి కోలుకున్నానని ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నేఫెర్రర్ పేర్కొన్నారు. గురువారం ఆమె కరోనా నుంచి కోలుకుని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతపురం శారదానగర్లోని ఆర్డీటీ ప్రధాన కార్యాలయ ఆవరణలోని నివాసానికి చేరుకున్నారు. ఆమె మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగుపడాలని ఆకాంక్షించిన జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆమె తనయుడు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచోఫెర్రర్, హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాలాఫెర్రర్తో పాటు పలువురు డైరెక్టర్లు, సిబ్బంది వెంట ఉన్నారు.
Updated Date - 2020-08-07T10:45:49+05:30 IST