ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-09-24T08:43:04+05:30

మండలంలోని బి. పప్పూరు గ్రామం వద్ద బుధవారం ద్విచక్రవాహనా లు ఢీకొని లక్ష్మీదేవి (55) అక్కడికక్కడే మృతిచెందింది. బండ్లపల్లికి చెందిన పెద్దన్న,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్పల, సెప్టెంబరు 23: మండలంలోని బి. పప్పూరు గ్రామం వద్ద బుధవారం ద్విచక్రవాహనా లు ఢీకొని లక్ష్మీదేవి (55) అక్కడికక్కడే మృతిచెందింది. బండ్లపల్లికి చెందిన పెద్దన్న, బాలపెద్ద, లక్ష్మీదేవి స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో దిగుమర్రి గ్రామానికెళ్లారు. పనులు ముగించుకుని, తిరిగి వ స్తుండగా పప్పూరుకు బైక్‌పై వస్తున్న సంజీవప్ప అతివేగంతో ఢీకొట్టాడు.


దీంతో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న లక్ష్మీదేవి తలకు తీవ్రమైన దెబ్బలు తగిలి, అక్కడికక్కడే చనిపోయింది. పెద్దన్న, బాలపెద్దకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 ద్వారా అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బండారు శ్రావణిశ్రీ ప్రమాద స్థలానికి చేరుకుని, లక్ష్మీదేవి మృతదేహానికి నివాళులర్పించారు.


గాయపడిన వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యమందించాలని అక్కడున్న డాక్టర్లను కోరారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఫణీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-09-24T08:43:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising