మద్యం దుకాణాలు మూసేయాలి
ABN, First Publish Date - 2020-05-09T09:49:33+05:30
ఇటీవల తెరచిన మద్యం షాపులను వెంటనే మూసేయాలని తెలుగు మహిళ నగరాధ్యక్షురాలు
అనంతపురం రూరల్/వైద్యం, మే 8: ఇటీవల తెరచిన మద్యం షాపులను వెంటనే మూసేయాలని తెలుగు మహిళ నగరాధ్యక్షురాలు విజయశ్రీ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో మద్యం షాపులు తెరచి, పేదల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. తక్షణం మద్యం షాపులు మూసేయాలని కోరారు. కార్యక్రమంలో నేతలు జానకి, ప్రసన్న, లక్ష్మి, వాణి, మహేశ్వరి, కృష్ణవేణి, మునెమ్మ పాల్గొన్నారు.
Updated Date - 2020-05-09T09:49:33+05:30 IST