ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొందాం

ABN, First Publish Date - 2020-06-22T10:26:04+05:30

నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమా 


కళ్యాణదుర్గం, జూన్‌ 21: నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల ముఖ్య నాయకులతో సమీక్షించారు. వైసీపీ నేతల ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొని అడ్డుకట్ట వేయాలన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటా ప్రచారం చేయాలన్నారు.


పాలనలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి నిప్పు, దానిమ్మ, మామిడి చెట్లు నరికివేత, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన సాగించాల్సిన పాలకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతుండడంతో ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ఏదిఏమైనా గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తల సంరక్షణ కోసం ఐక్యతగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-06-22T10:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising