విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN, First Publish Date - 2020-03-16T10:29:10+05:30
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
డీ హీరేహాళ్, మార్చి 15 : మండలంలోని హెచ్ఎ్స తండా గ్రామానికి చెందిన చంద్రానాయక్ (25) ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు హెచ్ఎ్స తండాకు చెందిన చంద్రానాయక్ రోజు మాదిరిగానే మేత కోసం మేకలను ఊరిబయటకు తీసుకెళ్లాడు. మేకల మేత కోసం ఆకులు కోస్తుండగా చెట్ల కొమ్మలకు ఉన్న విద్యుత్ తీగలకు జోటీ కొడవలి తగల డంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెం దాడు. అటుగా వెళుతున్న గ్రామస్థులు గమనించి సమా చారం అందించగా ఎస్ఐ వలీ బాషా సంఘటనా స్థలా నికి చేరుకుని విచారించారు. మృతుడి తండ్రి సేతూ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2020-03-16T10:29:10+05:30 IST