హిందూపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వెలివేయాలి
ABN, First Publish Date - 2020-07-04T10:08:31+05:30
నియోజకవర్గంలో సమస్యలు గాలికి వదిలి హైదరాబాద్లో ఎమ్మెల్యే బాలకృష్ణ, కర్నూలులో ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్లు
బీజేపీ నాయకుడు వజ్ర భాస్కర్రెడ్డి
హిందూపురం టౌన్, జూలై 3 : నియోజకవర్గంలో సమస్యలు గాలికి వదిలి హైదరాబాద్లో ఎమ్మెల్యే బాలకృష్ణ, కర్నూలులో ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్లు ఉన్నారని వారిని ఇక్కడి నుంచి వెలివేయాలని బీజేపీ హిందూపురం పా ర్లమెంట్ అధ్యక్షుడు వజ్రభాస్కర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ హిందూ పురానికి దగ్గరలో మెడికల్ కళాశాలకు భూములు దగ్గరలో ఉన్నాయని ఇక్కడే నిర్మిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుం దన్నారు.
అయితే వైసీపీ నాయకులు వారి స్వార్థ ప్రయో జనాల కోసం మరో చోటికి తరలించాలని చూస్తే అ డ్డుకుం టామన్నారు. మెడి కల్ కళాశాల కోసం విపక్షాల నా యకులు నిరసన తెలుప డాన్ని స్వాగతిస్తాం కానీ లేపాక్షిలో బైపాస్ రోడ్డు వెళ్లకుండా ఆపాలని పోరాడితే బాగుంటుందన్నారు. ఇప్పటికే లేపాక్షి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను ఉన్న తాధికారులతో మా ట్లాడి నిలుపుదల చేశామని పురాతనమైన ఆలయాలను కూ ల్చితే దానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోలేద న్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పా ర్థసారథి, ర మేష్రెడ్డి, మేడకుర్తి హరీ, రామ్మూ ర్తి, వరప్రసాద్ ఆదర్శ్కు మార్, టీకే బాబు, సుబ్రమణ్యం, మోహన్ పాల్గొన్నారు.
Updated Date - 2020-07-04T10:08:31+05:30 IST