దుర్గంలో ఫ్లెక్సీ వివాదం
ABN, First Publish Date - 2020-10-25T09:33:52+05:30
మాజీ మంత్రి, టీ డీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం స్థానికంగా అభిమానులు ఏర్పాటు ..
రాయదుర్గం టౌన్, అక్టోబరు 24: మాజీ మంత్రి, టీ డీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం స్థానికంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. కణేకల్లు రోడ్డులోని చికెన్ వ్యాపారి ఇబ్రహీమ్ దుకాణం వద్ద 13వ వార్డు టీడీపీ అభ్యర్థి నాగరాజు ఈఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
అయితే శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర, మున్సిపల్ మేస్త్రీ మంజు చికెన్ దుకాణం వద్దకు వెళ్లి ఫ్లెక్సీపై ఆరాతీశారు. రేపటి నుంచి చికెన్ కొట్టు తెరిస్తే సరుకంతా ఎత్తుకెళతామని చికెన్ వ్యాపారిని హెచ్చరించారు. దీంతో ఆయన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు కడ్డిపూడి మహబూబ్ బాషా దృష్టికి తీసుకువచ్చారు. మైనార్టీ కమిటీ నాయకులతో కలసి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటును జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకుల మెప్పుపొందేందుకే అధికారులు ఇలా వ్యవహరించారన్నారు. చికెన్ షాపు నిర్వహణకు ఆటంకం కలిగిస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
Updated Date - 2020-10-25T09:33:52+05:30 IST