రైతు బజార్లలోనే కూరగాయలు కొనుగోలు చేయండి
ABN, First Publish Date - 2020-03-31T11:34:13+05:30
నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఏడు రైతు బజార్లలోనే కూరగాయలు కొనుగోలు చేయాలని నగరపాలక సంస్థ
నగర కమిషనర్ రవీంద్ర
అనంతపురం కార్పొరేషన్, మార్చి30: నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఏడు రైతు బజార్లలోనే కూరగాయలు కొనుగోలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర కోరారు. పాతవూరు తాడిపత్రి బ స్టాండులోని మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో రైతు బజార్లు ఏర్పాటుచేశామన్నారు. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మకాలు జరుగుతాయన్నారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
Updated Date - 2020-03-31T11:34:13+05:30 IST