టీ20 లీగ్ పోటీల్లో తేజస్వి హ్యాట్రిక్
ABN, First Publish Date - 2020-10-30T09:06:32+05:30
టీ20 లీగ్లో వార్సియర్స్ బౌలర్ తేజస్వి హ్యాట్రిక్ సాధించాడు. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ సంఘం సంయుక్త ఆధ్వ ర్యంలో గురువారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ఆంధ్రా టీ20లీగ్ పోటీలు కొనసా గాయి.
లెజెండ్స్ జట్టుపై వారియర్స్ గెలుపు
అనంతపురం క్లాక్టవర్, అక్టోబరు 29: టీ20 లీగ్లో వార్సియర్స్ బౌలర్ తేజస్వి హ్యాట్రిక్ సాధించాడు. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ సంఘం సంయుక్త ఆధ్వ ర్యంలో గురువారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ఆంధ్రా టీ20లీగ్ పోటీలు కొనసా గాయి. మొదటి మ్యాచ్లో వారియర్స్, లెజెండ్స్ జట్లు పోటీ పడగా... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వారియర్స్ 19.1ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో ప్ర శాంత్ 48 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన లెజెండ్స్ 18.4 ఓవర్లలో 95పరుగులకే ఆలౌట్ అయి ఓటమిపాలైంది.
వారియర్స్ బౌలర్ తేజస్వి హ్యాట్రిక్ వికెట్లు సాధించి మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. మ రో మ్యాచ్లో కింగ్స్, టైటాన్స్ జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన కిం గ్స్ 17.2ఓవర్లలో 63పరులు చేసి ఆలౌట్ అయింది. టైటాన్స్ బౌలర్ లలిత్మోహన్ 4, గిరినాథ్రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన కింగ్స్ 12.2ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పగడాల మల్లికార్జున, మధు, మేనేజర్ సురేంద్ర, జగదీష్నాయుడు, శ్రీనివాస్, రవికాంత్, కోచ్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-30T09:06:32+05:30 IST