టిప్పర్ ఢీకొని సూపర్వైజర్ మృతి
ABN, First Publish Date - 2020-10-28T09:31:35+05:30
నగర శివారులోని కంకర ఫ్యాక్టరీలో టిప్పర్ ఢీకొని సూపర్వైజర్ మృతి చెందాడు.
అనంతపురం క్రైం, అక్టోబరు 27: నగర శివారులోని కంకర ఫ్యాక్టరీలో టిప్పర్ ఢీకొని సూపర్వైజర్ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీరామమూర్తి (42) కొన్నేళ్లుగా నగర శివారులోని ఇటుకలపల్లి సమీపంలోని బీఎ్సపీ కంకర ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పని చేస్తుండేవాడు. మంగళవారం అతడు విధుల్లో ఉండగా.. డ్రైవర్ నిర్లక్ష్యంగా టిప్పర్తో వె నుకవైపు నుంచి ఢీకొట్టాడు. గాయపడిన శ్రీరామమూర్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడని కు టుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటుకలపల్లి పోలీసు లు కేసు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-10-28T09:31:35+05:30 IST