అంతర్జాతీయ కవిసమ్మేళనంలో అనంతపురంవాసికి అవకాశం
ABN, First Publish Date - 2020-08-12T18:57:30+05:30
అంతర్జాతీయస్థాయిలో తానా నిర్వహించనున్న ఆన్లైన్ కవిసమ్మేళనంలో..
అనంతపురం(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయస్థాయిలో తానా నిర్వహించనున్న ఆన్లైన్ కవిసమ్మేళనంలో పాల్గొనేందు కు అనంతపురం నగరానికి చెందిన యువకవి చింతా లక్ష్మీనారాయణ ఎంపికైనట్లు తానా సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీ నివాస్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ’స్వాతంత్య్ర భారతి - సాహిత్య భారతి’ అనే పేరుతో ఈ నెల 15న కవి సమ్మేళనం నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 74 మంది కవులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
Updated Date - 2020-08-12T18:57:30+05:30 IST